Program: ఉత్తరము
Date: 2026-03-24
మనుష్యులలో ఇప్పటి వరకు పరలోకమునకు వెళ్లినవారు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం - యేసుక్రీస్తు ఒక్కడే ఇప్పటి వరకు పరలోకమునకు వెళ్లినవాడు. మిగిలిన నీతిమంతులంతా నెమ్మది పొందు ప్రదేశము అనగా, పరదైసులో విశ్రాంతి పొందుచూ పరలోకము కొరకు ఎదురుచూచుచున్నారు. యేసుక్రీస్తు రెండవ రాకలో పరదైసునందున్న వారందరి నిరీక్షణ సఫలమవుతుంది. అయితే, ఏలీయా మరియు హనోకులను గూర్చి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాక్యముల వివరణ ఏమిటి? ఏలీయా మరియు హనోకు కూడ పరదైసులోనే యున్నారని నిరూపించే ఈ పాఠ్యాంశమును విని దేవుని సమధానమును గ్రహించగలరు.