Program: దైవశక్తి
Date: 2026-02-20
నరుని నాసికారంధ్రములలోని జీవాత్మ. దేవుడు మనిషిని సృష్టించాడు. మొదటి మనిషియైన ఆదాము శరీరమును దేవుడు నేల మట్టితో నిర్మించాడు. ఆ మట్టి శరీరము యొక్క నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అక్కడి నుండి ప్రతి మనిషీ తల్లి గర్భములో తన శరీరమును పొందుచున్ననూ ప్రతి మనిషి శరీరమును రూపించుచున్నది మాత్రం దేవుడేనని మరచిపోకూడదు. ప్రతి మనిషికీ జీవాత్మను దయచేయుచున్నది కూడ దేవుడేనన్న సంగతిని కూడ మరచిపోకూడదు. ఈ విషయములపై అవగాహను పెంచే అద్భుతమైన సందేశమిది.