Program: ఉత్తరము
Date: 2026-02-10
క్రీస్తు మన కొరకు ఉంచిన మాదిరి.
మనుష్యులకు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనముగా ఉండాలో తెలియదు. మౌనముగా నుండుటకు, మాటలాడుటకు సమయమున్నదని లేఖనముల ద్వారా గ్రహించాలి.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకులచేత, శాస్త్రులచేత సిలువకు అప్పగింపబడినప్పుడు
ఆయన అధిపతి యొదుట మరియు ప్రధాన యాజకుల యెదుట మాటలాడిన సందర్భమూ ఉంది, ఆయన మౌనముగా ఉన్న సందర్భమూ ఉంది.
ఆయన మన యెదుట ఉంచిన ఈ మాదిరిని మనము అనుసరించగలిగితే
మనము కూడ దేవుని చిత్తనుసారముగా తగిన సందర్భమందు మాటలాడగలము, సందర్భము కానప్పుడు మౌనముగానూ ఉండగలము.
ఈ సందేశము ద్వారా చక్కని దైవజ్ఞాన సంగతులను గ్రహిస్తారని కోరుచున్నాము.