Program: కృపావార్త
Date: 2026-02-09
ప్రతి ఇల్లూ దేవునికి ఆలయమవ్వాలి!
మనిషిలో దేశభక్తిని పెంచాలంటే ముందుగా మనిషిలో దైవభక్తి పెరగాలి.
ఈ సూత్రము తెలియక ఆయా దేశాలు వారి ప్రజలకు దేశభక్తిని నేర్పించే క్రమములో విఫలమవుతున్నారు.
నిజముగా దైవభక్తిని పెంపొందించుకున్న మనుష్యులు తమ పొరుగువారిని ప్రేమిస్తారు, నీతిని అనుసరిస్తారు మరియు న్యాయముగా నడుచుకుంటారు.
పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలలో ప్రతి మనిషి దేవునికి ఆలయముగా మారాఅలని, తద్వారా ప్రతి కుటుంబము దేవుని భక్తికి నిలయమవ్వాలని సూచింపబడినది.
ఈ దేవుని సందేశమును విని, గ్రహించి మీరంతా దేవునికి మందిరములుగా మారాలని ఆశిస్తున్నాము.