Program: సిద్ధపాటు
Date: 2026-01-03
దేవుడు దయచేయుచున్న విడుదల.
ఇండియా దేశములో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమమును పురస్కరించుకుని కొందరు ఖైదీలను విడుదల చేయాలని కేంద్ర హోమ్ శాఖ నిర్ణయించింది.
అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన కారణము ఉంది.
అదేమిటంటే, ఇండియాలోని జైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి
4,03,000 మంది మాత్రమే పట్టే జైళ్లుండగా ప్రస్తుతం 4,78,000 మంది ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు.
ఇందువలన ఇండియాలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, పరమ తండ్రియైన దేవుడు సాతాను చెరలోనున్న ప్రతి ఒక్కరికీ విడుదలను అనుగ్రహిస్తున్నాడు.
ఎందరు ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యమును కోరుకుంటారో వారందరికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విడుదలను దయజేయుచున్నాడు.
ఈ విడుదలను మీరు కూడ పొందలనుకుంటే, ఈ సందేశమును ఆద్యంతం విని గ్రహించి దేవుని మాటలను అనుసరించి జీవించండి.