Program: కృపావార్త
Date: 2025-12-22
దేవుని మాటలను సమ్మతించవలెను.
దేవుని మార్గములో మనిషి నడచుకొనకపోవుటకు కారణం మనిషి దేవుని వాక్యమునకు సమ్మతిని చూపకపోవడమే.
నాటి ఇశ్రాయేలీయులు దేవుని వాక్యమునకు సమ్మతి చూపక ఖడ్గము పాలై నశించారు.
నేటి సర్వలోక జనులు కూడ అదే మాదిరిగా దేవుని వాక్యమునకు సమ్మతి చూపక నిత్యనరకాగ్నికి తరలిపోతున్నారు.
శరీరమును అణచుకొని ఆత్మను రక్షించుకొనగోరి దేవుని వాక్యమునకు సమ్మతి చూపితే మన భవిష్యత్తు నిత్యత్వములో ఉంటుంది.
ఈ విషయమై వివరింపబడిన ఈ పాఠ్యాంశము ద్వారా దేవుని జ్ఞానమును నేర్చుకొనగలరు.