Program: సిద్ధపాటు
Date: 2025-09-20
మనసులోని భారమును ఎవరితో చెప్పుకోవాలి?
అనుదినము అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మనిషి, తన బాధలను మరొక మనిషితో చెప్పుకొని మనస్సులోని భారాన్ని తగ్గించుకోవాలనుకుంటాడు.
అయితే, మనుష్యులు సాటి మనుష్యుల బాధలను అర్ధం చేసుకొని ఆ బాధలు తీరడానికి ప్రయత్నిస్తారా? లేదు! ఆ బాధలను రెట్టింపు చేస్తారు.
దేవుడొక్కడే న్యాయవంతుడై మన బాధలను తీరుస్తాడు.
కనుక, మన ప్రతి సమస్యను దేవునికి విన్నవించుకొని, ఆయన సహాయమును పొంది దేవుని మార్గములో మనము నడుకోవాలని పరిశుద్ధ గ్రంథములో సూచింపబడినది.
ఈ సంగతులన్నీ వివరించి మీ బాధలన్నీ తీర్చే అద్భుతమైన సందేశమిది.